ఆహార దోషాలు

మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి.
1. అర్ధ దోషం
2. నిమిత్త దోషం
3. స్ధాన దోషం
4. గుణ దోషం
5. సంస్కార దోషం.

ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు.

🔸 అర్ధ దోషం

ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.

భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది.

హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు.

తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.

తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు.

వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు.

శిష్యుడు తలవంచుకొని, “నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు.” అని తలవంచుకొన్నాడు.

ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం.

🔸 నిమిత్త దోషం

మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.

వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడ కూడదు.

అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి.

భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు.

అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది.

ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు
‘అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను.

నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం – బిందువులుగా బయటికి పోయి నేను
ఇప్పుడు పవిత్రుడినైనాను.

నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు.

చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి *’నిమిత్త దోషం ‘* ఏర్పడుతోంది.

🔸 స్ధాన దోషం

ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటll కూడా పాడైపోతుంది.

యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంతl మంచివి కావు.

దుర్యోధనుడు ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, “విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు.

మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి

🔸 గుణ దోషం

మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.

🔸సంస్కారదోషం

ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది.సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది.

సర్వేజనా సుఖినో భవంతు

మన వివాహ బంధం

*అసలు పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం, ఇష్టం-అయిష్టం గురించి కాదు. కాబోయే భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరిలో ఒకరు ఐక్యమైపోయి తమని తాము ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం. ప్రతి అమ్మాయికి, ప్రతి అబ్బాయికి చదువుకున్న భర్త, భార్య రావాలనుకకోవడం కన్నా తమ మనసులను చదవగలిగిన భర్త, భార్య రావడం అనేది వారి అదృష్టం.*_ _*అలాంటి అందమైన మనసున్న వారిని పొందాలని కోరుకోవాలి గాని, బయటకు కనిపించే పైపై అందాలను చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులను మాత్రమే చూసి ఇల్లు కొనుక్కొన్నట్లు ఉంటుంది. అందుకే పెద్దలు అన్నారు "అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు" చూడాలని. అంటే బలమైన పునాదులు, గట్టి గోడలు, నునుపైన పూతలు ఉన్నాయా లేదా అని చూడాలి.. అంటే వారి వంశ పుట్టుపూర్వోత్తరాలు చూడాలి..*_ _**భార్య భర్తల బంధం ఏంత బలంగా ఉండాలంటే, భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు. అలాగే భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు. అంతేకాదు భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి తప్ప అయోమయం కాకూడదు.*_ _**ఒకరి మనసులోని భావాలను మరొకరు చెప్పకుండానే అర్థం చేసుకొనేలా ఉండాలి. అంటే ఒకరి మనసులోని ప్రేమను గాని బాధని గాని కళ్లలో చూసి, నోటితో చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు కదా.. అలా అర్థం చేసుకొనే భార్య భర్తలు దొరికితే అడుక్కు తినేవారు కూడా ఆనందంగా హాయిగా జీవిస్తారు..*_ _**భార్య భర్తల బంధం ఒక మధురానుభూతిగా మిగిలి పోవాలి. అంటే ప్రతి భర్త తన భార్యను తన తల్లికి ప్రతి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను తన మొదటి బిడ్డగా పరిగణిస్తే అంతకు మించిన మధురమైన బంధం మరొకటి లేదు కదా..*_ _**సంసారం అంటే భార్య భర్తలు కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ ఒకరికి ఒకరు వెన్నంటి ఉంటూ, తోడూ నీడగా ఒకరిని ఒకరు వీడకుండా ఉండడం..*_ _**ఏది ఏమైనా, భార్యాభర్తల మధ్య సంబంధం శాశ్వతంగా ఉండిపోవాలి. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలోనే పోతారు. కానీ చివరి వరకు భార్యకి భర్త శాశ్వతం, భర్తకు భార్య శాశ్వతం. ఇది ప్రతి భార్య భర్తలు గుర్తుంచుకోవాలి..*_ _**నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం నీకు లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు. అలాగే నీవెన్ని గొప్ప చదువులు చదివినా, ఏంత గొప్ప ఉద్యోగం చేస్తూ ఏంతో గొప్పగా సంపాదించినా భర్త అండదండలు లేకపోతే ఆ భార్య జీవితం నిరర్ధకమే..*_ _**ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడెమో కానీ, భార్యను బాగా అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. అలాగే ఒక మంచి భార్య తన భర్త మనసెరిగి భర్త మదనపడకుండా, మనస్థాపానికి లోనుకాకుండా చూసుకొంటుంది.. తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే కదా..*_ _*అలాకాకుండా ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తూ, మిడిసిపాటుతో అహంకారి అయిన భార్య దొరికితే అంబానీ లాంటి వారు కూడా సన్యాసంలో కలవాల్సిందే. అలాగే దురలవాట్లకు బానిసైన వ్యసనపరుడైన భర్త దొరికితే ఆ భార్య జీవితం నరకప్రాయం అయినట్లే..*_ _**ఒక మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉండాలనుకొంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తానే రాణిగా ఉంటుంది.*_ _**తమ కుటుంబంలో తమ మధ్య ఎన్ని కీచులాటలున్నా సమాజంలో తన భర్త పరువును నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. అలాగే అందరిముందు భార్యను చులకనగా చూడకుండా తన భార్యను అందరి ముందు గౌరవించవలసిన ధర్మం భర్తకు ఉండాలి.*_ _**భార్య భర్తల బంధం ఎలా ఉండాలంటే "గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండేలాంటి గట్టి బంధమై ఉండాలి." అలాంటి బంధం దొరకడం ఒక గొప్ప వరం..*_ _**భార్య భర్తల స్మృతులు ఎలా ఉండాలంటే "నీ సంతోషం నేను కాకపోయినా, నా చిరునవ్వు మాత్రం నువ్వే అయ్యుండాలి, నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే అయ్యుండాలి " అనే విధంగా ఉండాలి..*_ _**భార్య భర్తలు ఇరువురు ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటూ ఒకరి పనులలో ఒకరు సహాయం చేసుకుంటూ సేవ చేయడం అంటే ఒకరి కింద ఒకరు బానిసగా బ్రతుకుతున్నామని కాదు ఇక్కడ అర్థం, ఒకరి బంధాన్ని మరొకరు గౌరవిస్తున్నామని అర్థం..*_ _*నిజానికి భార్య భర్తల బంధం అన్నది ఒక అందమైన పుస్తకం లాంటిది. జీవితంలో జరిగే చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఆ పుస్తకంలోని అచ్చు తప్పుల వంటివి. అచ్చు తప్పులున్నాయని మంచి పుస్తకాన్ని పారెయ్యలేము కదా.. అలాగే చిన్న చిన్న పొరపాట్లు జరిగినంత మాత్రాన బంధాలను తెంచుకోకుండా, మరొకసారి అలాంటి పొరపాటు జరుగకుండా చూసుకొనే వారి బంధం శాశ్వతంగా నిలిచిపోతుంది..*_ _**నీ భార్య గొప్ప చదువులు చదివి గొప్ప ఉద్యోగం చేస్తూ గొప్పగా సంపాదించేదిగా ఉండక్కర్లేదు. జీవిత పాఠాలను చదివి ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగి, నీ వంశాభివృద్ధి కోసం నీకు ఇద్దరు ప్రతినిధులను అందించే ప్రతి గృహిణీ గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క!..*_ _**అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ నీ జన్మకు అర్థం లేదు. మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి మసులుకొనేదే "మాంగల్య బంధం" అంటే..*_ _**అటువంటి బంధాలు తెగిపోకుండా శాశ్వతంగా ఉండాలి అంటే, ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. ఒకవేళ మనం తప్పు చేస్తే క్షమించమని ఎదుటి వారిని క్షమాపణ అడగాలి. ఒకరిపైన ఒకరికి ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానులు ఉండాలి. ముఖ్యంగా ప్రేమ అనేది చాలా విలువైనది. అందుకే "మన బ్రాహ్మణ వివాహం"అనే గుడిలో ప్రేమ అనే విగ్రహాన్ని పెట్టుకుని పూజించుకొన్నపుడే వివాహబంధం రాణిస్తుంది..*_

*ఈ సృష్టిలో భగవంతుడు తీర్చిదిద్దిన సుందరమైన అతి గొప్ప కళాఖండం మన “మన కుటుంబం”. ఆ కుటుంబం వ్యవస్థను అర్థం చేసుకొని అవగాహనతో జీవించుదాం శుభమస్తు…

మాట జారితే మనసు విరుగుతుంది !!

ఎవరైనా మీ మనసు మీద దెబ్బ కొట్టే మాటలు మాట్లాడితే మౌనంగా భరించండి కానీ మాటలు జారితే బంధాలు విచ్చిన్నం అవుతాయి…మాటకు అంత బలముంది! నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు…అదే మాట తీరు…ప్రతి రోజు ఎంతో మందితో మాట్లాడితే చాలా మందిలో పరిపక్వత తో కూడిన మాటలు కనబడవు! ఒకాయన తన ఆత్మస్తుతి వినిపిస్తే మరొకాయన తన ప్రొఫెషన్ డబ్బా కొట్టుకుంటాడు! చాలా మందిలో సెల్ఫ్ గోల ఎక్కువే! అయితే ప్రతి మాటను మనం పరిశీలిస్తే ఆయన మానసిక స్థితిని అంచనా వేయవచ్చు! కాకి – కోయిల నలుపే కానీ కాకి గోల అంటారు… కోకిల రాగం అంటారు మాట తీరు కూడా అంతే ఆచితూచి మాట్లాడే వారికి గౌరవం ఎక్కువ! సుత్తి కొట్టే వారిని వదిలించుకుందామని అనిపిస్తుంది! చాలా మంది తన గొప్ప తనం తనకు తాను చెప్పుకునే వారికన్నా ఆయన గురించి మరొకరు మంచిగా చెప్పిన వారికే గౌరవం ఉంటుంది! విచిత్రం ఏమిటంటే మానసిక శాస్త్రం అవపోసనం పట్టే వారికి ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటల్లో అబద్దాలు ఎన్నో ఇట్టే అర్థం అవుతాయి! కడుపులో నుండి మాట్లాడే వారే నిజాయితీగా ఉంటారు! ఆర్భాటాలు చెప్పే వారు ఎదుటివ్యక్తిలో లోకువ ఆవుతారు!ఇక కొంత మంది ఉంటారు

చిన్న మాటకే చివ్వుకున్న చిన్నబుచ్చుకుంటారు… ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మాట్లాడలేదో గ్రహించకుండా నోరు పారేసుకుంటారు.. అది జీవిత కాలం మనసులో నిక్షిప్తం అయ్యి ఆ మనిషిని చూస్తే ఆ మాటలే గుర్తుకు వస్తాయి! ఎదుటి వ్యక్తిని కించపరిచే మాటలు మాట్లాడితే ఆయనతో పనిబడ్డప్పుడు మీ ముఖం లో అంతరాత్మ ప్రవేశించి ఆ మాటలను గుర్తుకు తెస్తాయి! తండ్రి కొడుకుల బంధాలు,అత్తా కోడలు బంధాలు ఈ మాట తీరుతో విచ్చిన్నం ఆవుతాయి! మనవణ్ణి ఎత్తుకొని ముద్దాడుతున్న కూడా …కోడలు దెప్పి పొడిచే మాటలకు వాడిపై ఆపేక్షను పక్కన బెట్టి “నువ్వు కూడా మీ అమ్మ తీరే పోరా” అంటూ కోడలి మాటలను గుర్తుకు తెచ్చుకొని ఏడ్చే అత్తగార్లు ఉన్నట్టే నువ్వు మీ అమ్మ పోలికే అన్నన్ని మాటలు అని ఇప్పుడు కాళ్ళ బేరానికి వస్తారా అనే మొగుణ్ణి చీదరించుకునే కోడలు దెప్పి పొడుపులు చాలా కుటుంబాల్లో కనబడతాయి!మనిషి మాట్లాడే మాటల్లో

తిట్లూ, దీవెనలు, పొగడ్తలు, విమర్శలు కపట వాక్యాలు.. ఇలా ఎన్నెన్నో వినిపిస్తుంటాయి. అందులో సార్థకమైనవి కొన్నైతే నిరర్థకమైనవి ఎన్నో ఉంటాయి.మనిషి వ్యక్తిత్వం అతడి మాటల్లో తొంగి చూస్తుందంటారు పెద్దలు. అందుకే మంచి మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి. మనిషికి ఆరు రకాల బాషణాలు వన్నె తెస్తాయి..మిత భాషణం హిత భాషణం, స్మిత భాషణం, ప్రియ భాషణం, పూర్వ భాషణం, సత్య భాషణం!! అలా మాట్లాడటం నిజంగా ఒక కళ ! చాలా కొద్దిమంది ఆకర్షణీయంగా మాట్లాడగలుగుతారు. ఎదుటి మనిషి నొచ్చుకోకుండా దేన్నయినా చక్కగా చెప్పగలుతారు. మనలో ఎన్నో ఉద్వేగాలలోంచి ఒక మాట బయటికి వస్తుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితిలోనూ చక్కగా మాట్లాడగలగటం ఒక నేర్పు. అందమైన భావవ్యక్తీకరణకు తగినంత అందమైన భాష తో మాట్లాడితే గౌరవం పెరుగుతుంది. మాట ఒక మలయ సమీరంలాగా ఉండాలి. ఒక సువాసనల మెత్తని పువ్వు లాగా అవతలి మనిషికి చేరాలి. మెత్తని ఈకతో గాయం పైన నవనీతం రాసినంత సున్నితంగా ఉండాలట! అంతేగానీ అది పుల్ల విరిచినట్లు.. అవతలి మనిషి మొహం తిరిగిపోయేంత నొప్పి తగిలినట్లు ఉండకూడదు. మాట తేనె కంటే మధురంగా ఉండాలి!!

వంటనూనెల్లో దాగిన విషం

@ జాగ్రత్త పడవలసిన విషయం #

సన్ ఫ్లవర్ 30-40 సంవత్సరాల క్రితం పండించే వారే కాదు అసలు మన భారతదేశంలో 40 సం” కిందట సన్ ఫ్లవర్ నూనె లేదు, పంట లేదు…,
మన ఆహారధాన్యం నూనె ధాన్యం కానే కాదు.
ఆరోగ్యానికి హానికరం

మన భారత దేశం లో తక్కువనే పండిస్తారు

మరి ప్రతి నెలా ఇన్ని లక్షల లీటర్ల సన్ ఫ్లవర్ నూనె ఎలా వస్తున్నది ??

సన్ ఫ్లవర్ నూనె పాకెట్ లో కేవలం 10-15% సన్ ఫ్లవర్ నూనె ఉంటుంది (అది కూడా ఆరోగ్యానికి హానికరం) మిగితా 60% ప్యరాఫీన్ ఆయల్

👉⛽క్రూడ్ లో నుండి డీజిల్, పెట్రోల్ తీసిన తరువాత నీరు లాంటి పారాఫిన్ (Paraffin) ఆయల్ బయటకు వస్తుంది దీనిని వంట నూనెలా ఉపయోగిస్తే హార్ట్, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ , డయాబెటిస్ వ్యాధులు వస్తాయి. ఈ నూనె చాల ప్రమాదకరం🐽

మిగతా 30% శాతం పామాయల్ ఉంటాయి.
పాం ఆయల్ తినే నూనె కాదు హార్ట్ మరియు నరాల వ్యాధులు వస్తాయి.
పూర్వకాలం లో ఎవ్వరూ ఉపయోగించలేదు. అసలు 30 సం”ల క్రితం ఈ పామాయల్ ఉనికే లేదు !

ఈ కల్తీ నూనెలకు తోడు ప్లాస్టిక్ ప్యాకెట్లు….
ప్లాస్టిక్ లో BPA
(bisphenol A) ఇంకా pthalates అనే అతి విషకరమైన కెమికల్స్ నూనె లో కలుస్తాయి వీటి వలన మగవాళ్లలో వీర్యోత్పత్తి తగ్గిపోయి నపుంసకులుగా మారుతున్నారు..!

📵 దరిదాపుగా మార్కెట్ లో బ్రాండెడ్ నూనెలుగా మనం వాడుతున్నవేవీ మంచివి కావు.

కల్తీ నూనెలు నుంచి కాపాడుకునే మార్గాలు :-

👉వేరు శెనగలు, నువ్వులు కుసుమలు లాంటి నూనె ధాన్యాలు కొని ఆయిల్ మిల్ లో మన కళ్ల ముందే గానుగ పట్టించాలి.

👉నూనెను ప్లాస్టిక్ కంటైనర్ లో వేస్తే ప్లాస్టిక్ లో ఉన్న విష కెమికల్స్ నూనె లో కలిసి పోతాయి కాబట్టి నూనె నిల్వ చెయ్యడానికి స్టీల్ కంటైనరే వాడాలి.

👉ఇలా మనం సొంత నూనె వాడుకుంటే భారత దేశంలో 80-90% హార్ట్ వ్యాధులు దూరం అవుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి రుగ్మతలు దరికి రావు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అవసరం తగ్గుతుంది !!

మరి ఎలాంటి వంట నూనెలు వాడాలి

జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన వంట నూనెలను వాడవలెను. శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైండ్ నూనే (Non Refined Oil). నూనెలో ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె వాడాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది, బాగా జిగురు, జిగురుగా ఉంటుంది. చిక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది . నూనెలో ఉండవలసిన ముఖ్య అంశం జిగురు పదార్ధము, ప్రోటీన్స్. ఆ జిగురును వేరు చేస్తే నూనె మిగలదు. నూనెలో వాసన రూపంలో ఉండే ఆర్గానిక్ కంటేంటే ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్. నూనెని రిఫైండ్ (Refined) చేసినపుడు జిగురు, వాసన పోతాయి. ఇక అందులో ఉండేది నూనె కాదు నీళ్ళే . ఏ నూనెలో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కోలెస్ట్రాల్ వుండదు . మనము తీసుకొనే ఆహారము మరియు నూనెల నుండి మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్ తయారవుతుంది . మనము శుద్ధమైన నూనె (Non Refined Oil) తీసుకున్నప్పుడు మన శరీరంలో *లివర్* సహాయంతో మంచి కొలెస్ట్రాల్ (H.D.L.) ఎక్కవ మోతాదులో తయారవుతుంది. శుద్ధమైన నూనె వాడి జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి. భారత దేశంలో 50 సంవత్సరాల పూర్వం వరకు ఈ రిఫైండ్ ఆయిల్ లేదు. రిఫైండ్ నూనె చేసేటప్పుడు 6 రకాల హానికరమైన కెమికల్స్, డబుల్ రిఫైండ్ చేసేటప్పుడు 13 రకాల హానికరమైన కెమికల్స్ వాడుతారు. ఈ కెమికల్స్ ముందు ముందు మన శరీరంలో వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి. ఈ రిఫైండ్ అయిలో మన శరీరానికి కావలసిన జిగురు, వాసన, ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఏవీ వుండవు. చాలా హానికరమైన ఎటువంటి రిఫైండ్ ఆయిల్స్ వాడకూడదు. వాతాన్ని నివారించటానికి శుద్ధమైన నూనె, పిత్తాన్ని నివారించటానికి దేశవాళి ఆవు నెయ్యి, కఫంను సక్రమంగా ఉంచాలంటే అన్నింటికన్నా ఉత్తమమైనవి బెల్లం, తేనె.

కుస్తీపట్లు, దండీలు, బస్కీలు తీసేవారికి మాత్రమే గేదె నెయ్యి మంచిది. రోగాలకు రాజు వాతరోగాలు.

మోకాళ్ళ నొప్పులు, నడుం నొప్పి, మెడనొప్పులు, హార్ట్ ఎటాక్, పక్షవాతము, బ్రైన్ ట్యూమర్ వంటివి వాతము పూర్తిగా తగ్గిపోవటం వల్ల కానీ లేదా చెడిపోవటం వల్ల కానీ కలుగుతాయి. జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్దమైన నునెలు (Non -Refined) వేరు శెనగ నూనె , కొబ్బరి నూనె, కుసుమల నూనె, నువ్వుల నూనె మరియు ఆవాల నూనెలు మాత్రమే వాడవలెను. ప్రొద్దుతిరుగుడు పూల విత్తనాలను (Sun flower seeds) గేదలకు మరియు పశువులకు మాత్రమే పెట్టదగినవి . మనకు ఏ మాత్రము ఈ Sun flower oil వాడదగినది కాదు, ఆరోగ్యకరము కాదు. ఈ రిఫైండ్ ఆయిల్స్ (Refined oils) ఎంత మాత్రమూ వాడతగినవి కాదు . సోయాబీన్స్, సోయాబీన్స్ ఆయిల్ మరియు సోయాబీన్ పాలు ఏ మాత్రము వాడరాదు. పందులు తినతగినవి ఈ సోయాబీన్స్, ఎందుకనగా పందులు మాత్రమే వీటిని తిని అరగించు కోగలవు . మనుష్యులలో ఈ సోయాబీన్స్ ని అరిగించే ఎంజైమ్స్ లేనే లేవు. కావున వీటిని వాడరాదు. వీటిని వాడిన యెడల మందులు లేని భయంకరమైన రోగాలు ఖచ్చితంగా వస్తాయి. పామోలిన్ అయిల్ కూడా చాలా హానికరమైన అయిల్. వీటిని వాడుతున్నవారికి మొదట మలబద్దకుము వస్తుంది. ఈ మలబద్దకమే అన్ని రోగాలకు మూలము. ప్రస్తుతము చాలా రోగాలకు మూలము ఈ పామోలిన్ అయిల్. ఈ పామోలిన్ పంట పండించే దేశాలలో ఈ నూనెను నిషేదించినారు. వారు ఏ విధముగా కూడా ఈ పామోలిన్ వాడటం లేదు. ప్రపంచములో ఒక్క భారత దేశములో మాత్రమే ఉపయోగిస్తున్నారు. విదేశీయులకు భారత దేశము ఒక ప్రయోగశాలగా మారింది. కావున మనము మన సంపూర్ణ ఆరోగ్యము కొరకు త్యజించ వలెయును . *శుద్దమైన నూనెలను* వాడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించ గలరు.

గమనిక :-
సన్ ఫ్లవర్ ఆయిల్ (Sun Flower Oil), సోయాబిన్ ఆయిల్ (Soya Bean Oil) , పామోలిన్ ఆయిల్ (Pamolene Oil) ఈ నూనెలు వాడరాదు.

షుగర్ అంటే ఏమిటి?!

మొదటి చక్కెర మిల్లును 1868 లో బ్రిటిష్ వారు భారతదేశంలో స్థాపించారు. “ఈ చక్కెర మిల్లును స్థాపించడానికి ముందు, భారతీయ ప్రజలు స్వచ్ఛమైన స్థానిక బెల్లం తినేవారు, అందువల్ల వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురికావడం లేదు.”

చక్కెర అనేది ఒక రకమైన విషం, ఇది అనేక వ్యాధులకు కారణమని నిరూపించబడింది. దీన్ని వివరంగా తెలియజేయడమైనది

(1) – చక్కెర తయారీ ప్రక్రియలో ఉపయోగించే ప్రధాన పదార్థం సల్ఫర్. బాణసంచా తయారీలో ఉపయోగించే మసాలా సల్ఫర్!

(2) – సల్ఫర్ చాలా భారీ రసాయన మూలకం. అది మానవ శరీరంలోకి వెళ్ళిన తర్వాత, దాన్ని బయటకు తీయడం అసాధ్యం అవుతుంది.

(3) – చక్కెర చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది, దీనివల్ల గుండెపోటు వస్తుంది.

(4) – చక్కెర శరీర బరువును అధికంగా పెంచుతుంది, దీనివల్ల es బకాయం వస్తుంది.

(5) – చక్కెర రక్తపోటును పెంచుతుంది.

(6) – మెదడు దాడికి చక్కెర ప్రధాన కారణమని నిరూపించబడింది.

(7) – ఆధునిక వైద్య శాస్త్రం చక్కెరలో తీపి రుచిని సుక్రోజ్‌గా గుర్తిస్తుంది. సుక్రోజ్ మానవులకు మరియు జంతువులకు జీర్ణించుకోవడం కష్టం.

(8) – చక్కెర తయారీ ప్రక్రియలో ఇరవై మూడు హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు.

(9) – డయాబెటిస్‌కు ప్రధాన కారణం చక్కెర.

(10) – కడుపు పుండుకు చక్కెర ప్రధాన కారణం.

(11) – శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుదల చక్కెర వల్ల వస్తుంది.

(12) – పక్షవాతం రావడానికి చక్కెర ప్రధాన కారణం.

(13) సాధ్యమైనంతవరకు, చక్కెరను వదిలివేసి, స్వచ్ఛమైన బెల్లం తినడం ప్రారంభించండి.

పంచదార తినకండి ప్రాణం మీదకు తెచ్చుకోకండి

నువ్వుల నూనె

ఈ భూమిపై లభించే ఉత్తమమైన ఆహారాల గురించి మాట్లాడుకుంటే, అప్పుడు *నువ్వుల నూనె* పేరు ఖచ్చితంగా వస్తుంది.

మరియు ఈ ఉత్తమ పదార్థం మార్కెట్లో అందుబాటులో లేదు. రాబోయే తరాలకు దాని గుణాలు కూడా తెలియదు. ఎందుకంటే ఈ కొత్త తరం జనం, టీవీ వాణిజ్య ప్రకటనలను చూసిన తర్వాత మాత్రమే అన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. మరియు కంపెనీలు నువ్వుల నూనెను ప్రోత్సహించవు.

ఎందుకంటే దాని లక్షణాలను తెలుసుకున్న తరువాత, మీరు ఆ కంపెనీల నూనె అని పిలువబడే ద్రవ కందెన(కొవ్వు)ను తీసుకోవడం మానేస్తారు. _*నువ్వుల నూనెను నూనెలకు నూనె అంటారు.*_ నువ్వుల నూనెకు చాలా బలం ఉంది, అది రాయిని కూడా చీల్చుతుంది.

మీరు ప్రయత్నించండి. ఒక కొండ రాయిని తీసుకొని ఒక గిన్నెలాగ తయారు చేసి, ప్రపంచంలో నీరు, పాలు, ఆమ్లం లేదా ఆమ్లం ఉంచండి, ప్రపంచంలో ఏదైనా రసాయన, ఆమ్లం, అదే రాయిలో అలాగే ఉంటుంది.

కానీ… మీరు ఆ గిన్నెలో నువ్వుల నూనెను, ఆ గొయ్యిలో నింపండి .. 2 రోజుల తరువాత మీరు చూస్తే, నువ్వుల నూనె… రాయిలోకి ప్రవేశించి రాయి కిందకు వస్తుంది.

ఇది నువ్వుల నూనె యొక్క బలం. ఈ నూనెతో మసాజ్ చేయడం వలన, అది ఎముకలను దాటి, ఆ ఎముకలను బలపరుస్తుంది. నువ్వుల నూనెలో భాస్వరం ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నువ్వుల నూనెను ఏదైనా గానుగ నుండి కొనండి. తైలం అనే పదం "తిల్" అనే పదం నుండి వచ్చింది. అంటే, నూనె యొక్క నిజమైన అర్ధం "నువ్వుల నూనె" అని అర్థం. నువ్వుల నూనె యొక్క గొప్ప గుణం ఏమిటంటే, ఇది శరీరానికి ఎంతో శుభప్రదంగా పనిచేస్తుంది ..

మీకు ఏ వ్యాధి ఉన్నా, దానికి వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తుంది. ఈ గుణము ఈ భూమి మీద ఇతర ఆహార పదార్థాలలోను కనుగొనబడలేదు. 100 గ్రాముల తెల్ల నువ్వులలో, 1000 మి.గ్రా కాల్షియం లభిస్తుంది. నువ్వులు, బాదం కన్నా 6 రెట్లు ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి. నలుపు మరియు ఎరుపు నువ్వులు, ఇనుముతో సమృద్ధిగా ఉంటాయి, ఇది రక్త లోపానికి చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది. నువ్వుల నూనెలో ఉన్న లెసిథిన్ అనే రసాయనం, రక్త నాళాలలో కొలెస్ట్రాల్ ప్రవాహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. నువ్వుల నూనెలో సహజంగా , సీస్మోల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా చాలా త్వరగా క్షీణించటానికి అనుమతించదు. *ఆయుర్వేద చరక సంహిత లో, వంట చేయడానికి ఇది ఉత్తమమైన నూనెగా పరిగణించబడనది.* నువ్వుల నూనెలో, విటమిన్-C మినహా అన్ని అవసరమైన పోషక పదార్థాలు ఉన్నాయి, ఇవి మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. నువ్వులు విటమిన్ -బి మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఇది మీథోనిన్ మరియు ట్రిప్టోఫాన్ అని పిలువబడే రెండు ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంది, ఇవి పప్పు దినుసులు, వేరుశెనగ, బీన్స్, చోలాస్ మరియు సోయాబీన్స్ వంటి చాలా శాఖాహార ఆహారాలలో కనిపించవు. ట్రిప్టోఫాన్‌ను ప్రశాంతమైన పదార్థం అని కూడా పిలుస్తారు, ఇది గాఢ నిద్రను కలిగించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెథోనిన్ కాలేయాన్ని సరిచేస్తుంది మరియు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. టిల్బీస్ జీవక్రియను పెంచే ఆరోగ్యకరమైన కొవ్వుల యొక్క పెద్ద మూలం. ఇది మలబద్దకాన్ని కూడా అనుమతించదు. నువ్వు గింజల్లో ఉండే పోషక అంశాలు కాల్షియం, ఐరన్ వంటివి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి. నువ్వుల నూనెలో తక్కువ సంతృప్త కొవ్వు ఉంటుంది, కాబట్టి దీని నుండి తయారైన ఆహారాలు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణ అర్ధం ఏమిటంటే, మీరు సేకరించిన స్వచ్ఛమైన నువ్వుల నూనెను క్రమం తప్పకుండా తీసుకుంటే, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువ. అనారోగ్యంతో లేనప్పుడు, చికిత్స అవసరం ఉండదు. ఇది ఆయుర్వేదం చెబుతోంది. ఆయుర్వేదం యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటంటే, సరైన ఆహారమే మాత్రమే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అపుడు శరీరానికి చికిత్స అవసరం ఉండదు. కొంతమంది ప్రజలు మార్కెట్లో నువ్వుల నూనె పేరిట మరికొన్ని నూనెలను విక్రయిస్తున్నారని గుర్తుంచుకోవాలి .. ఇది గుర్తించడం కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీ ముందు తీసిన నూనెను మాత్రమే నమ్మండి. ఈ పని కొంచెం కష్టం, కానీ మొదటిసారి చేసిన ప్రయత్నంగా, ఈ స్వచ్ఛమైన నూనె మీకు అందుబాటులో ఉంటుంది. ఈ నువ్వుల నూనెలో మోనో-అసంతృప్త కొవ్వు ఆమ్లం ఉంటుంది, ఇది మంచి కొలెస్ట్రాల్‌ను (HDL) అందించటం ద్వారా శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బులు, గుండెపోటు మరియు అథెరోస్క్లెరోసిస్ అవకాశాలను తగ్గిస్తుంది.

క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది : నువ్వులు సెసామిన్ అనే యాంటీఆక్సిడెంట్ కలిగివుంటాయి, ఇది క్యాన్సర్ కణాలు పెరగకుండా ఆపుతుంది మరియు దాని మనుగడ రసాయన ఉత్పత్తిని ఆపడానికి సహాయపడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్, (Lung cancer), కడుపు క్యాన్సర్, లుకేమియా, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రభావాలను తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో నియాసిన్ అనే విటమిన్ ఉంటుంది, ఇది ఒత్తిడి మరియు నిరాశను తగ్గించడంలో సహాయ పడుతుంది.

గుండె కండరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడుతుంది. ఈ నూనెలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ మరియు సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి, ఇది గుండె కండరాలు సజావుగా పనిచేయడానికి సహాయ పడుతుంది మరియు క్రమమైన వ్యవధిలో గుండె కొట్టుకోవడానికి సహాయపడుతుంది.

శిశువుల ఎముకలను బలపరుస్తుంది. నువ్వులు ప్రోటీన్ మరియు అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి, ఇది పిల్లల ఎముకల పెరుగుదలను బలోపేతం చేయడానికి సహాయ పడుతుంది. ఉదాహరణకు, 100 గ్రాముల నువ్వులు 18 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటాయి, ఇది పిల్లల అభివృద్ధికి చాలా ముఖ్యమైనది.

గర్భిణీ స్త్రీ మరియు పిండం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

నువ్వుల లో ఫోలిక్ ఆమ్లం ఉంటుంది, ఇది గర్భిణీ స్త్రీ మరియు పిండం యొక్క అభివృద్ధి మరియు ఆరోగ్యకరమైన అభివృద్ధికి సహాయపడుతుంది.

నువ్వుల నూనె శిశువులకు మసాజ్‌ చేయడానికి పని చేస్తుంది. అధ్యయనం ప్రకారం, నువ్వుల నూనెతో శిశువులకు మసాజ్ చేయడం వల్ల వారి కండరాల బలానికి, వాటి అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఈ నూనెతో మసాజ్ చేయడం ద్వారా, పిల్లలు హాయిగా నిద్రపోతారు.

బోలు ఎముకల వ్యాధితో పోరాడటానికి సహాయపడుతుంది. నువ్వుల నూనెలో జింక్ మరియు కాల్షియం ఉన్నాయి, ఇది బోలు ఎముకల వ్యాధి అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

డయాబెటిస్ మందులను సమర్థవంతంగా పని చేయిస్తుంది. తమిళనాడులోని వినాయకా మిషన్ విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ అధ్యయనం ప్రకారం, ఇది అధిక రక్తపోటును తగ్గించడంతో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని 36% తగ్గిస్తుంది. యాంటీ-డయాబెటిక్ ఔషధం, గ్లిబెన్క్లామైడ్తో కలిపినప్పుడు సహాయపడుతుంది. అందువల్ల, టైప్ 2 డయాబెటిక్ రోగికి ఇది సహాయపడుతుంది. నువ్వులు, పాలతో పోలిస్తే మూడు రెట్లు కాల్షియం కలిగి ఉంటాయి. ఇందులో కాల్షియం, విటమిన్ బి మరియు ఇ, ఐరన్ మరియు జింక్, ప్రోటీన్ మరియు కొలెస్ట్రాల్ పుష్కలంగా ఉంటాయి.

ఇవి పాలల్లో లేవు. నువ్వుల నూనె, చాలా సంవత్సరాలు పాడవదు, వేసవి రోజులలో కూడా అదే విధంగా ఉంటుంది.

నువ్వుల నూనె సాధారణ నూనె కాదు. ఈ నూనెతో మసాజ్ చేస్తే, శరీరం గొప్ప ఉపశమనం పొందుతుంది. పక్షవాతం వంటి వ్యాధులను కూడా నయం చేసే సామర్థ్యం దీనికి ఉంది.

దీనితో, మహిళలు తమ రొమ్ముల కింది నుండి పైకి మసాజ్ చేస్తే, అప్పుడు రొమ్ములు బలపడతాయి. శీతాకాలంలో మీరు ఈ నూనెతో శరీరానికి మసాజ్ చేస్తే, జలుబు అనిపించదు.

నువ్వుల నూనెతో ముఖానికి మసాజ్ చేస్తే, ముఖం యొక్క అందం మరియు మృదుత్వాన్ని కాపాడుతుంది.
పొడిగా ఉన్న చర్మానికి ఇది ఉపయోగపడుతుంది. నువ్వుల నూనెలో, విటమిన్ A మరియు విటమిన్ E సమృద్ధిగా ఉంటాయి. ఈ కారణంగా, ఈ నూనెకు ఇంత ప్రాముఖ్యత ఉంది. ఈ నూనెను వేడి చేసి చర్మంపై మసాజ్ చేయడం వల్ల, చర్మము నిగారింపు పొందుతుంది.

జుట్టు మీద పూస్తే, వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి.

మీకు కీళ్ల నొప్పులు ఉంటే, నువ్వుల నూనెలో కొద్దిగా శొంఠి పొడి, చిటికెడు ఇంగువ పౌడర్ వేసి వేడి చేసి మసాజ్ చేయండి. నువ్వుల నూనె ఆహారంలో సమానంగా పోషకమైనది. మను ధర్మం లో కూడా నువ్వులు లేకుండా ఏ కార్యము సిద్దించదు, పుట్టుక, మరణం, పరానా, యజ్ఞం, శ్లోకం, తప, పిత్ర, పూజ మొదలైనవి నువ్వులు లేకుండా ఉన్నట్లు రుజువు లేదు. నువ్వులు మరియు నువ్వుల నూనె లేకుండా ఇది సాధ్యం కాదు, కాబట్టి ఈ భూమి యొక్క అమృతాన్ని అవలంబించి జీవితాన్ని ఆరోగ్యంగా చేసుకోండి. చాలా ఉపయోగకరమైన విషయం.

సర్వేజనాఃసుఖినోభవంతు

మనిషికి మనిషి భరోసా

అనగనగా, ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి…కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు. ఇంతకీ ..ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట!

కాని కేవలం వాడికి వీడు..వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.

నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే… నేను ఉన్నాను అనే భరోసా…ఒక మాట సాయం.. ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..మనిషికి ఎంత బలం వస్తుందో..ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.


ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, “ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం” అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!
రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, “ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా” అని ఉత్సాహంగా అదిలించాడు. అంతే! రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది. పెద్దాయన ఆశ్చర్యంతో, ” సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ‌, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?”
రైతు, “ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా! ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకం తో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!”
రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!


పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో ‘మేము ఉన్నాం’ అనే భరోసా కారణం…కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు..బంధువులు నీ చుట్టూ లేక పోవటం…

కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇద్దాం…అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేద్దాం..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి….
🙏🏻🙏🏻🙏🏻

The Leaking Bucket

~ You wake up early in the morning trying to do your Prayers, but your mind is elsewhere and before you know it, you’re done with it, without being mindful of it.
(A leaking bucket)

~ You’re very kind to outsiders / people in general and speak with them gently, but with your own family you’re always harsh / rude.
(A leaking bucket)

~ You honour and treat your guests well but when they leave, you gossip about them and talk about their flaws.
(A leaking bucket)

~ You try to read as much religious books, listen to Satsang /Keertan, participate in social services, but you swear, insult, curse daily.
(A leaking bucket)

~ You help others but you’re doing it to gain something in return from them and not doing those acts of kindness selflessly.
(A leaking bucket)

~ You frequently advice/preach others, but practice none of those principles yourself.
(A leaking bucket)

~ You slander other devout persons out of hatred/spite, when your views do not meet one another person’s views.
(A leaking bucket)

~ You look down on others and feel more superior than them, judging their level of knowledge, based on external appearances.
(A leaking bucket)

We struggle to fill our “lives”(the bucket) with “earnings” of education & knowledge (the water), hoping it will retain the contents inside, but it leaks every now & then by the many flaws (the holes in the bucket) that we commit daily. We need to make conscious efforts to plug the holes in our Bucket.

కాశీ క్షేత్రం లో విశ్వప్రాణ శక్తి కేంద్రాలు..

శ్రీ చక్రం లో ఎలా అయితే 9 ఆవరణలు ఉంటుందో కాశీలో విశ్వప్రాణ శక్తి కేంద్రాలు 7 ఆవరణలు ఉన్నాయి, వివిధ కోణాలు యంత్రం లో ఉన్నట్టు వివిధ ప్రాంతాల్లో ఒక ఆవరణలో ఒక కోణం ఈ క్రమం ప్రకారం మొత్తం 56 ఈ ప్రకారం 7 ఆవరణలో 56 కేంద్రాలలో కాస్మిక్ ఎనర్జీ అయస్కాంత శక్తి లాగా ఆకర్షిస్తుంది, క్రమంగా ఆ ప్రాంతంలో ఎక్కడ కూర్చుని ధ్యానం, మంత్ర జపం చేస్తే ఊహించని విధంగా మంత్ర ప్రయోజనం తెలుస్తుంది సిక్స్త్ సెన్స్ త్వరగా ప్రచోదనం అవుతుంది.. మంత్ర త్వరగా సిద్ధిస్తుంది ఆ స్థలంలో ఉన్న శక్తి అటువంటి ది మీరు ఆ ప్రాంత్రాలలో నిరంతరం క్రమంగా కొద్దీ రోజులు ధ్యానం చేస్తే మీకు త్వరగా ధ్యానంలో మనసు నిలకడ లభిస్తుంది ఏకాగ్రత కుదరడం వల్ల మంత్రం శ్వాసతో లీనమై సిద్ది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది..

అయితే ఈ శక్తి కేంద్రాలు భావితరాలకు ఉపయోగ పడాలి అని మన పూర్వీకులు ఎక్కడ అయితే ఎక్కువగా శక్తి విశ్వం నుండి ఆకర్షించ బడుతుందో ఆ ప్రాంత్రాలలో వరుసగా విగ్నేశ్వరుడుని ప్రతిష్ట చేశారు.. కాశీలో ఉన్న ఈ ప్రసిద్ధ విగ్నేశ్వర దేవాలయాలు అన్ని కాస్మిక్ ఎనర్జీ కి నిలయాలి.. ఆలయం అక్కడ ఉంటే అక్కడ ప్రభావం తెలియని వారు కూడా అక్కడికి వస్తారు కాసేపు ఉంటారు అందువల్ల వారి శరీరంలో రోగ నిరోధక శక్తి, జ్ఞాపకాశక్తి పెరుగుతుంది…కాసేపు ఉన్నా ఎంతో ప్రశాంతంత కలుగుతుంది.. అటువంటి వినాయక అలయాలన్ని కలిపి “షట్టంచశద్వినాయకుల” అంటారు..ఈ 56 మంది వినాయకులను దర్శించటమే చప్పన్ యాత్ర అంటారు కానీ ఆ విగ్నేశ్వరుడు ఉన్న ప్రాంతాలు అన్ని శక్తి కేంద్రాలు కు ప్రసిద్ధ నిలయం అని చాలా తక్కువ మందికే తెలుసు. వాటి వివరాలు చూద్దాము..

👉ఇందులో ఏడు ఆవరణలుంటాయి ఒక్కో ఆవరణలో ఎనిమిది మంది వినాయకులు .ఏడు ఆవరణల్లో కలిపి యాభై ఆరు మంది అవుతారు.🙏

♦️మొదటి ఆవరణ లో♦️

లోలార్క కుండం లోనీ అర్క వినాయకుడు ,
దుర్గా కుండం లో దుర్గా వినాయకుడు ,
భీమ చండి లో భీమ చండీ వినాయకుడు ,
ప్రసిద్ధమ్ లో ఉన్న దేహలీ వినాయకుడు ,
భుయిలీ లో ఉద్దండ వినాయకుడు ,
సదర్ బజార లో పాశ పాణి వినాయకుడు ,
వరుణా సంగమం దగ్గరున్న ఖర్వ వినాయకుడు ,
మణి కర్ణికా ఘాట్ వద్ద సిద్ధి వినాయకుని దర్శిస్తే ప్రధమ ఆవరణం పూర్తీ అయినట్లు.

♦️రెండవ ఆవరణలో ♦️
కేదార్ ఘాట్ వద్ద లంబోదర వినాయకుడు ,
కుమి కుండ మహల్ దగ్గర కూట దంత వినాయకుడు ,
మాడు అమేహ్ వద్ద కాల కూటవినాయకుడు ,
ఫుల్ వరియా లో కూష్మాండ వినాయకుడు ,
వారాణసీ దేవి మందిరం లో ముండ వినాయకుడు ,
ధూప చండీ దేవి వెనుక వికట దంత వినాయకుడు ,
పులుహీ కోటలో రాజ పుత్ర వినాయకుడు ,
త్రిలోచనా ఘాట్ లో ప్రణవ వినయ దర్శనం తో ద్వితీయ ఆవరణం పూర్తీ .

♦️మూడవ ఆవరణం ♦️
చోసట్టీ ఘాట్ లో వక్ర తుండ లేక సరస్వతీ వినాయకుడు,
బంగాలీ బోలా వద్ద ఏక దంత వినాయకుడు ,
సిగిరావార్ లో త్రిముఖ వినాయకుడు (వానర ,సింహ ,ఏనుగు ముఖాల తో )పిశాచ మోచన తాలాబ్ పై పంచాస్య వినాయకుడు ,
హేరంబ వినాయకుడు ,
చిత్ర కూట సరోవర్ దగ్గర విఘ్న రాజ వినాయకుడు ,
ప్రహ్లాద్ ఘాట్ వద్ద వరద వినాయకుడు ,
ఆది దేవ మందిరం లో మోదక ప్రియ వినాయకుడు ల దర్శనం తో తృతీయ ఆవరణం సంపూర్ణం.

♦️నాలుగవ ఆవరణం ♦️

శూల కన్తేశ్వర స్వామి ఆలయం లోనీ అభయద వినాయకుడు ,
బాల ముకుంద చౌహట్టా లో సింహ తుండ వినాయకుడు ,
లక్ష్మీ కుండం పై కూణితాక్ష వినాయకుడు ,
పితృ కుండం పై క్షిప్ర ప్రసాదన వినాయకుడు ,
ఇసర్ గంగీ పై చింతా మణి వినాయకుడు బడా గణేష్ ఆవరణ లోనీ దంత హస్త వినాయకుడు ,
ప్రహ్లాద ఘాట్ లో పిచండిలా వినాయకుడు ,
వారాణసీ దేవి మందిరం లోనీ ఉద్దండ ముండ వినాయకుని దర్శిస్తే చతుర్ధ ఆవరణం పూర్తీ .

♦️అయిదవ ఆవరణం♦️

మాన్ మందిర్ ఘాట్ లో స్తూల దంత వినాయకుడు ,సాక్షి గణపతి వద్ద కలిప్రియ వినాయకుడు ,ధవేశ్వర్ మందిరం లో చతుర్దంత వినాయకుడు ,సూర్య కుండం దగ్గర ద్విదంత వినాయకుడు ,మహల్ కాశీ పురా లో జ్యేష్ట వినాయకుడు ,మిక్చర్ ఘట్టా లో గజ వినాయకుడు ,రాం ఘాట్ లో కాల వినాయకుడు ,ఘోసలా ఘాట్ లో నాగేశ వినాయకులను చూస్తె పంచమ ఆవరణం అయినట్లు.

♦️ఆరవ ఆవరణం♦️

మణి కర్ణిక వద్ద మణి కర్ణ వినాయకుడు ,
మీర్ ఘాట్ లో ఆశా వినాయకుడు ,
కాళికా గల్లీ లో సృష్టి వినాయకుడు ,
డుండి రాజు వద్ద యక్ష వినాయకుడు ,
బాన్స్ ఫాఠక్ వద్ద గజకర్ణ వినాయకుడు ,
చాందినీ చౌక్ లో చిత్ర ఘంట వినాయకుడు ,
పంచ గనఘా ఘాట్ వద్ద “స్థూల “, “జంఘ “వినాయకుల దర్శనం తో షష్ఠ ఆ వరణం పూర్తీ.

♦️ఏడవ ఆవరణం ♦️

జ్ఞాన వాపి వద్ద మోద వినాయకుడు ,
విశ్వనాధ కచాహరి లో ప్రమోద వినాయకుడు ,
సముఖ వినాయకుడు దుర్ముఖ వినాయకుడు గజ నాద వినాయకుడు ,
జ్ఞాన వాపీ దగ్గర జ్ఞాన వినాయకుడు
విశ్వనాధ ద్వారం వద్ద ద్వార వినాయకుడు అవి ముక్తేశ్వరుడి వద్ద అవి ముక్త వినాయకులను దర్శిస్తే సప్తమ ఆవరణ తో పాటు చప్పన్ వినాయక దర్శనం పరి పూర్తీ అయినట్లే.

👉సిద్దులు ,సాధకులు, తాంత్రికులు ఈ కేంద్రాల్లో ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటారు యాత్ర కోసం వెళ్లే గృహస్థులు ఈ ప్రదేశాలను సందర్శించిన చాలా మంచి యోగం లభిస్తుంది.

♦️🙏శ్రీ మాత్రే నమః🙏♦